Friday, May 17, 2024

బెడ్ల సంఖ్య పెంచండి

- Advertisement -
- Advertisement -

కరోనా కేసులు ఇంకా పెరిగితే ఎదుర్కొవడానికి
సిద్ధంగా ఉండాలి, వ్యాక్సినేషన్ వేగవంతం
ఆక్సిజన్ వృథా అరికట్టేలా చర్యలు
జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్-19 కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కోవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో బెడ్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్ధితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. జిల్లాలలో టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రజలు పాటించేలా నిబంధనల అమలుకు కృషిచేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని, కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులు ఆక్సీజన్ ను సక్రమంగా వినియోగించి, వృధా ను అరికట్టేలా చైతన్యపరచాలన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అంచనా వేస్తూ ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రులు ఆక్సిజన్ సక్రమంగా వినియోగించేలా చూడాలని సిఎస్ సూచనలు చేశారు. సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిష్ర్టేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, శ్రీనివాస్ రావు, , వైద్య, ఆరోగ్య శాఖ అడ్వైజర్ టి. గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CS Somesh Kumar review on Covid 19 Situation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News