Monday, April 29, 2024

రంధి తీర్చిన ‘బంధు’

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవే శ పెట్టిన దళితబంధు తొలి దశ విజయవంతంగా పూర్తయ్యింది. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత కుటుంబాలకు 10 లక్షల గ్రాంటుతో బతుకు బాట చూపిన ఈ పథకం యావత్ దేశంలోనే చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ అ ద్భుత పథకం గురించి ఇతర రాష్ట్రాలన్నీ వాకబు చేస్తున్నా యి.తెలంగాణను అదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తం గా ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని దలితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లో అ మలు సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయనే విషయమై పలు రాష్ట్రాలు చేస్తున్నట్లు తెలిస్తోంది. ఇందుకు గాను బంధు పథకం గురించి వాకబు చేస్తున్నారు. కెసిఆర్ మానస పుత్రిక అ యిన దళిత బంధు పథకం తొలిదశలో ఇప్పటివరకు 38 వేల 323 కుటుంబాలకు లబ్ధి చేకూరింది.

ప్రతి కుటుంబానికి వారు ఎంచుకున్న స్వయం ఉపాధి పొందేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, ప్రతి యూనిట్‌కు రూ. 10 లక్షలు గ్రాంటుగా ఇవ్వడం జరిగింది. తొలి విడతలో ప్రభుత్వం ఈ పథకం కింద దళిత కుటుంబాలకు సుమారు రూ. 3,900 కోట్లు ఖర్చు చేసింది. దీంతో దళితుల జీవన ప్రమాణాలు పెరిగాయి. స్వ యం ఉపాధి ద్వారా ఆదాయా న్ని పొంది గౌరవప్రద జీవనం గడుపుతున్నారు. దళితులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందు కు ఈ పథకం పోత్సహిస్తోంది. రంగానికి ప నికివచ్చే ఇటుకల తయారీ యూనిట్లు, ఎవర్‌గ్రీన్ వ్యాపారం అయిన ఆటో మొబైల్ షాపులు, పుస్తకాల షాపులు, ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు, రైస్ మిల్లులు, సిమెంట్ దుకాణాలు, హార్వెస్టర్ యూ నిట్లు, మెడికల్ స్టోర్స్,

పేపర్ ప్లేట్ తయారీ యూనిట్ లు, ఎలక్ట్రికల్ షాపులు, షూ మార్ట్, ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్, మినీ డెయిరీ యూనిట్, ఐరన్ బెడ్స్ తయారీ యూనిట్‌లు, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ యూనిట్‌లు, సంచుల తయారీ కేంద్రం వంటి స్వయం ఉపా ధి మార్గాల ద్వారా దళిత కుటుంబాలు ఆర్థికంగా త మ జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకున్నాయి. చి న్న యూనిట్లను పెట్టుకోవడం, వ్యాపారాలు చేయ డం ద్వారా నెలకు పాతిక నుండి రూ.30 వేల వర కు సంపాయిస్తున్నట్లు దళిత లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 శాసనసభ ని యోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు.

ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద లబ్ధి చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి 2023-24 వార్షిక బడ్జెట్‌లో రూ. 17,700 కోట్లు కేటాయించింది. దశాబ్దాలుగా అమలు చేస్తున్న సాం ప్రదాయ పథకాలకు బదులుగా దళితబంధు పథకం లో వినూత్న కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చు ట్టింది. లబ్ధిదారుని అభిరుచి, ఇష్టా ఇష్టాలకు లోబడి స్వయం ఉపాధిని ఎంచుకునే స్వేచ్ఛను ప్రభుత్వం లబ్ధిదారుడికే కల్పించింది. దళిత బంధు రక్షణ నిధిని ఏర్పాటు చేసి ఆపద సమయంలో ఆదుకునేందుకు, ఈ పథకాన్ని బలోపేతం చేయడం జరిగింది. ఇందుకోసం లబ్దిదారుడు రూ.10 వేలు, ప్రభుత్వం రూ. 10 వేలు ఈ నిధికి వాటాగా సమకూర్చడం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జులై 2021లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం అందించారు. ఫలితంగా అనేక స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని దళితులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. మొత్తం 93 రకాల స్వయం ఉపాధి మార్గాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందించింది.

అందులో ముఖ్యంగా క్యాబ్‌లు నడిపేందకు కార్లు కొనుగోలు చేయడం, ట్రాక్టర్లు, మందుల షాపులు, ఎరువుల దుకాణాలు, పాల ఉత్పత్తుల విక్రయం, ఇలా రక రకాల ఆదాయం వచ్చే వృత్తులను లబ్దిదారులు ఎంచుకున్నారు. పాసింజర్ వెహికల్స్, డెయిరీ ఫారంలు, గూడ్స్ వెహికిల్స్, మిని సూపర్ బజార్, జెసిబి, బట్టల షాపులు, రెడిమెడ్ గార్మెంట్, షీప్ యూనిట్స్, పౌల్ట్రీ ఫారం, లాంటి అనేక ఉపాధి మార్గాలను లబ్దిదారులు ఎంచుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని వాసాలమర్రి గ్రామ పంచాయతీలో ఆగష్టు 2021లో ఈ పథకం కింద 75 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చారు. ఖమ్మం సూర్యాపేట, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లోని ఎస్‌సి అసెంబ్లీ నియొజకవర్గాలు మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, జుక్కల్ లోని ఒక్కో గ్రామాన్ని ఎంచుకొని ఈ పథకాన్ని అమలు చేశారు. దీంతో 4వేల 808 మంది దళిత కుటుంబాలకు లబ్దిచేకూరింది.

2021 -22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 118 అసెంబ్లీ నియోజవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున మొత్తం 11,800 కుటుంబాలకు దళిత బంధు పథకం కింద లబ్ది చేకూర్చారు. దళిత బంధు పథకం రెండో దశ అమలు కోసం మార్గదర్శకాలు రూపొందించేందకు అధికారుల స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా, వైఫల్యాలకు ఆస్కారం లేకుండా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News