Monday, April 29, 2024

అసోంలో వరదలకు 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గువాహటి: అసోం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్రకు వరదలు రావడంతో ఇప్పటివరకు 17 జిల్లాల్లో దాదాపు 1.90 లక్షల మంది నిర్వాసితులయ్యారు. మంగళవారం శివసాగర్ జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు పెరిగింది. లఖింపూర్ జిల్లాలో ఎక్కువగా 47,338 మందిపై వరదల ప్రభావం పడింది. ధేమాజీలో 40,997 మంది వరద బాధితులయ్యారు. గువాహటి వద్ద బ్రహ్మపుత్ర నదిలో, జోర్హాట్ లోని నిమ్తిఘాట్‌లో ఫెర్రీ సర్వీస్‌లను నిలిపివేశారు. 8086.40 హెక్టార్ల పంటభూములు దెబ్బతిన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News