Saturday, April 27, 2024

ఆ పరీక్ష రద్దు చేయాలని కెటిఆర్ ను కలిసిన డిఎంకె ఎంపిలు…

- Advertisement -
- Advertisement -

DMK MPs meet with KTR

హైదరాబాద్: నీట్ పరీక్ష రద్దు అంశం పై మంత్రి కెటిఆర్ ను కలిశామని డిఎంకె ఎంపిలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నీట్ పరీక్ష అంశం పై తాము నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కేంద్ర విధానంపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని కోరామన్నారు. కేంద్రం కీలకమైన విషయాలలో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదని డిఎంకె ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ ఎంపి రంజిత్ రెడ్డి

డిఎంకె ఎంపి మంత్రి కెటిఆర్ ను కలిశారని టిఆర్ఎస్ ఎంపి రంజిత్ రెడ్డి తెలిపారు.  లెటర్ తీసుకొచ్చి కెటిఆర్ కి స్వయంగా అందించి మద్దతు  ఇవ్వాలని అడిగారన్నారు. నీట్ పరీక్ష రద్దు అంశం పై ఇప్పటికే తమిళనాడు సిఎం స్టాలిన్, ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News