- Advertisement -
సిద్దిపేట: గేటెడ్ కమ్యూనిటీ తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్లో లబ్ధిదారులు గృహ ప్రవేశం సందర్భంగా ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. నయాపైసా ఖర్చులేకుండా 216 మంది పేదలకు గృహ ప్రవేశం చేయిస్తున్నామని, నూతన వస్త్రాలను లబ్దిదారులకు బహుకరించారు. లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సద్వినియోగం చేసుకోవాలని హరీష్ సూచించారు.
- Advertisement -