Friday, May 17, 2024

ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్ అర్థ సెంచరీ

- Advertisement -
- Advertisement -

 

టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. ఓపెనర్ డకెట్ 39 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. అతని స్కోరులో 11 ఫోర్లు ఉండటం గమనార్హం. మరో ఓపెనర్ జాక్ క్రాలే మాత్రం నెమ్మదిగా ఆడుతున్నాడు. అతను ఏడు పరుగులు చేశాడు.

అంతకుముందు టీమిండియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (112) సెంచరీలు చేయగా టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ కు నాలుగు వికెట్లు లభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News