Monday, April 29, 2024

మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 53/3

- Advertisement -
- Advertisement -

చెన్నై: భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో 482 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ డామ్ సిబ్లీ(03), జాక్ లీచ్(0)లను స్పిన్నర్ అక్షర్ పటేల్ పెవిలియన్ పంపించాడు. దూకుడుగా ఆడుతున్న మరో ఓపెనర్ బర్న్స్(25)ను అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 50 పరుగులకే 3 వికెట్లు కోల్లపోయి ఒత్తిడిలో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జోరూట్ తో కలిసి లారెన్స్ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా మూడో రోజును ముగించాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.ప్రస్తుతం క్రీజులో జోరూట్(2), లారెన్స్(19)లు ఉన్నారు. కాగా, ఇంగ్లండ్ విజయానికి రెండు రోజుల్లో 429 పరుగుల కావాలి. తొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 134 పరుగులకే ఆలౌట్ అయ్యిన విషయం తెలిసింది.

ENG 53/3 at stumps on Day 3 in 2nd Test against IND

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News