Monday, May 6, 2024

ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్….

- Advertisement -
- Advertisement -

England scored is 416 runs in Eng vs Ind

 

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 73 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 221 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత జట్టు 416 పరుగుల ఆధిక్యంలో ఉంది. విరాట్ కోహ్లీ, రవీచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. భారత బ్యాట్స్‌మెన్లలో రవీచంద్రన్ అశ్విన్ (68), విరాట్ కోహ్లీ (62),  రోహిత్ శర్మ (26), శుభ్‌మన్ గిల్ (14), అజింక్య రహానే (10), రిషబ్ పంత్ (08), ఛటేశ్వరా పుజారా(07), అక్షర పటేల్ (07), కుల్దీప్ యాదవ్ (03) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో రవీచంద్రన్ అశ్విన్(68), ఇషాంత్ (0) బ్యాటింగ్ చేస్తున్నారు. ఏడో వికెట్‌పై విరాట్ కోహ్లీ, రవీచంద్రన్ అశ్విన్ 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మోయిన్ అలీ నాలుగు వికెట్లు పడగొట్టగా జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News