Saturday, April 27, 2024

సింధూజ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించిన ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

రాజపేట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలం కుర్రారం గ్రామంలో దోసలవాగులో జనగామ జిల్లా చిన్నమడూర్ గ్రామ ఎంపిటిసి గోడుగు సుజాత మల్లికార్జున్ కుమార్తె సిందూజ సోమవారం వాగులో కొట్టుకొని పోయి మృతి చెందింది. మంగళవారం ఉదయం చిన్నమడూర్ గ్రామంలో సింధూజ పార్థివ దేహంపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. సిందుజ మృతదేహం వద్ద మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మృతురాలి తండ్రి మల్లికార్జున్, కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News