Saturday, May 4, 2024

నూతన టెక్నాలజీని ప్రతిఒక్కరూ అందిపుచ్చుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • నేరస్థులను గుర్తు పట్టడంలో సిసి కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి: సిపి శ్వేత

సిద్దిపేట: సిసి నేరస్థులను గుర్తుపట్టడంలో సిసి కెమెరాలు ప్రముఖ పాత్ర వ హిస్తామని సిపి శ్వేత అన్నారు. మంగళవారం సిసి కెమెరాల పర్యవేక్షణ గురించి అదేశానుసారం ప్రతి పోలీస్ స్టేషన్ కో ఆర్డినేటర్లుగా కార్యాలయంలో సిసి కెమెరాల పర్యవేక్షణ, ఇన్‌పుట్, అవుట్‌పుట్, ఎన్విఆర్, డివిఆర్ తదితర అంశాల గురించి రెండు రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన టెక్నాలజీని ప్రతిఒక్క రు అందిపుచ్చుకోవాలని సూచించారు.

బాబు రోజులలో నూతనంగా సిసి కెమెరాలు వస్తాయని ఎ ప్పుడు సిసి కెమెరాల రిపేర్ పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. మనిషి మనుగడకు టాలెంట్ టెక్నాలజీ జీవితంలో చాలా ముఖ్యమని తెలిపారు. పాడైన సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ పనిలో నైపుణ్యాన్ని సాధించాలని సూచించారు. పె రుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఇప్పటికప్పుడు నేర్చుకోవడం రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ గురించి తెలుసుకోవడం పోలీస్ వి ధి నిర్వహణలో చాలా ముఖ్యమని తెలిపారు. పో లీస్ స్టేసన్ కెమెరాలను చెక్ చేసుకోవాలన్నారు.

జిల్లాలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు భద్రత సెన్సాఫ్ సెక్యూరిటి క ల్పించడం మన ముఖ్య ఉద్దేశమన్నారు. ఏర్పాటు చే సే ప్రతి సిసి కెమెరా క్వాలిటీగా ఉండాలన్నారు. సిసి కెమెరా ద్వారా కేసుల చేదన గురించి ఛాలెంజ్ గా తీసుకొని విధులు నిర్వహించాలన్నారు. సంబంధిత ప్రజాప్రతినిధులతో కలిసి కమ్యూనిటి నేను సై తం ద్వారా సిసి కెమెరాల బ్యాకప్ , కవరేజ్ పెంచాలన్నారు. గ్రామాల్లో పట్టణాలలో ప్రజలు, ఇంటి యజమానులకు సిసి కెమెరాలు అవగాహన కల్పించాలన్నారు. సిసి కెమెరాల వల్ల ఎన్నో ఉన్నాయన్నారు. సిసి కెమెరాల గురించి ప్రతి రోజు మానిటర్ చేయాలని సూచించారు. అదనపు డిసిపి మహేందర్, సిసిఆర్బి ఏసిపి చంద్రశేఖర్, ఎస్బి ఇన్‌స్పెక్టర్ రఘుపతిరెడ్డి, జిల్లా సిసి కెమెరాలు కో ఆర్డినేటర్ పరందాములు, వెంకటేశ్, జగన్, పోలీస్ స్టేషన్ సిసి కెమెరాల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News