Monday, April 29, 2024

చిన్నారిని చిదిమేసిన దోషికి ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

Execution of accused in Dwarka murder case

హైదరాబాద్ : ఎపిలో సంచలనం రేపిన చిన్నారి ద్వారక హత్య కేసులో ప్రకాశ్ దోషిగా తేలడంతో విజయవాడ మహిళా సెషన్ కోర్టు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రతిభాదేవి తీర్పునిచ్చారు. 2019 నవంబర్ 10న విజయవాడ గొల్లపూడిలోని ఇంటి వద్ద ఆడుకుంటున్న ద్వారక అనే చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందుడు ప్రకాష్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో 35 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ప్రకాష్‌ను దోషిగా తేల్చింది.

బాలికను ప్రకాష్ హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణరెడ్డి తెలిపారు. విజయవాడలోని భవానిపురంలో నివాసం ఉండే మొవ్వా అనిల్ కుమార్ కుమార్తె ద్వారక 2019 నవంబర్ 10న అదృశ్యమైంది. అనంతరం బాలిక పక్కింట్లో ఉంటున్న ప్రకాష్ చేతిలో దారుణ హత్యకు గురైంది. బాలికను హత్య చేసిన ప్రకాష్.. ఏమీ తెలియనట్లు బాలిక కోసం తల్లిదండ్రులతో కలిసి గాలించడం సంచలనం కలిగించింది. చిన్నారిని చంపేసి నమ్మకంగా కుటుంబసభ్యుల వెంటే తిరిగినా సైకోని గుర్తించలేకపోయారు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు ప్రకాష్ నే నిందితుడుగా తేల్చారు.

Execution of accused in Dwarka murder case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News