Monday, April 29, 2024

పరస్పరం గులాబీ పూలిచ్చుకున్న రైతులు, పోలీసులు..!!

- Advertisement -
- Advertisement -

Farmer and Policeman gave each other Roses

 

న్యూఢిల్లీ: ఓవైపు దేశ రాజధానిలో ఉద్రిక్తత నెలకొనగా, యుపి, ఢిల్లీ సరిహద్దులోని చిల్లా వద్ద అరుదైన సంఘటన జరిగింది. పోలీసులూ, రైతులూ ఒకరికొకరు గులాబీ పూలిచ్చుకొని స్నేహాన్ని చాటుకున్నారు. నోయిడా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రణవిజయ్‌సింగ్, బికెయు(భాను) నేత యోగేశ్‌ప్రతాప్‌సింగ్ ఒకరికొకరు గులాబీ పూలిచ్చుకున్నారు. అంతేగాక రైతులు వండిన భోజనాన్ని సింగ్ స్వీకరించారు. నిరసన స్థలానికి తిరిగి చేరుకుంటున్న రైతులను అడ్డుకోబోమని ఈ సందర్భంగా సింగ్ హామీ ఇచ్చారు.దాంతో, ఆ ప్రాంతంలో రైతులు, పోలీసుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్నది. ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలకు ఇతరులు ప్రవేశించడమే కారణమన్న రైతు సంఘాల నేతల అనుమానాలకు ఇది ఓ నిదర్శనంగా నిలుస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News