Monday, April 29, 2024

రైతు నేత రాకేశ్ తికాయత్ కారుపై దాడి

- Advertisement -
- Advertisement -

Farmer leader Rakesh Tikait's car attacked

 

జైపూర్: భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) నేత రాకేశ్‌తికాయత్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. శుక్రవారం రాజస్థాన్ అల్వర్ జిల్లా తతార్‌పూర్ గ్రామంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. దాడిలో ఆయన కారు అద్దాలు పగిలాయి. దాడికి గురైన కారు వీడియోను తికాయత్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. బిజెపి గూండాలు తన కారుపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వ్యాఖ్యానించారు. ఇనుప రాడ్లు, రాళ్లతో దుండగులు దాడి చేశారని పోలీస్ అధికారులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. హర్సోరా అనే గ్రామంలో రైతులనుద్దేశించి ప్రసంగించిన తికాయత్ బాన్సూర్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో కాన్వాయ్‌పై దాడి జరిగింది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్‌లో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు తికాయత్ నేతృత్వం వహిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News