- Advertisement -
మన తెలంగాణ/ ధర్పల్ల్లి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ముప్కాల్కు చెందిన ప్రొఫెసర్ మగ్గిడి కిషన్కు సోమవారం ఘనంగా సన్మానించారు. ప్రతి ఏడు కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక మాస ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయనకు వచ్చిన ఆహ్వానం మేరకు ఢిల్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మగ్గిడి కిషన్ ఈ ఉత్సవానికి హాజరయ్యారు. అష్ఠావధాని మాడ్గుల ఫణిశర్మ అవధాన సరస్వతి పీఠంచే నిర్వహించే ఈ అష్టావధాన కార్యక్రమంలో ప్రముఖుల్లో ఒకరిగా ప్రొ.కిషన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు శాలువ, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ప్రొ.కిషన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో తనకు సన్మానం పొందడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
- Advertisement -