Monday, April 29, 2024

ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

మానవతా దృక్పథంతో మళ్లీ అందరికీ ఉద్యోగాలు

7,521 మందికి ఊరట అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలుపుకున్న
కెసిఆర్ ఎక్కడి వారికి అక్కడే జాబ్స్ డిఆర్‌డిఎలకు
రిపోర్టు చేయాలని సూచన రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ ఉపాధి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మానవతా దృక్పథంతో మళ్లీ వారందరికిఉద్యోగాలిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నుంచే వారు విధుల్లో చేరవచ్చని ఆదేశాలిచ్చింది. డిఆర్‌డిఎలకు రిపోర్టు చే యాలని సూచించించి. దీంతో అసెంబ్లీలో ఇచ్చి న మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిలుపుకున్నట్లైంది. దీంతో గతంలో పని చేసిన చోటే 7,561మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తిరి గి విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర వ్యా ప్తం గా 2007 ఫిబ్రవరిలో 7,561 మంది ఫీల్ అసిస్టెంట్లని ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. అప్ప ట్లో 1200 జీతంతో విధుల్లోకి వచ్చిన వారికి కొద్ది నెలల్లోనే రూ. 10వేల జీతాలు ఇ చ్చింది. ఉపాధి హామీ కూలీల మస్టర్ రోల్స్ రా యడం, వారిపనులను పర్యవేక్షించడం వం టి పనులు చేశారు.

తర్వాత జాబ్ కార్డులు ఉన్నవాళ్ళల్లో సాధ్యమైనంత ఎక్కువమందిని ఉపాధికి వచ్చేవిధంగా చూడాలని, విధుల్లో తప్పనిసరిగా ఉం డాలని అధికారులు ఆదేశించారు. ఇదే సమయంలో తమకు జీతాలు ఎస్‌టిఒల నుంచి ఇ వ్వాలని, తమను పర్మినెంట్ చేయడంతో పా టు మరికొన్ని డిమాండ్లతో ఫీల్ అసిస్టెంట్లు ఆం దోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం తేదీ 18 మార్చి, -2020 నుంచి వారిని తాత్కాలికం గా పక్కన పెట్టింది. అప్పటి నుంచి వారు తిరిగి ఉ ద్యోగాల్లో చేరేందుకు విశ్వప్రయత్వాలు చే యా ల్సి వచ్చింది. సిఎం కెసిఆర్‌తో పాటు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పలుమార్లు వారు వినతిపత్రాలు సమర్పించారు. వారి అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తిరిగి ఉద్యోగాల్లోఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం కల్పించింది.

డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను శాశ్వత ప్రాతిపదికన నియమించి వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫీల్డ్ అసిస్టెంట్లు 2020 మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. ప్రభుత్వం లిస్ట్ 1, 2, 3గా విభజించి జీవో నెం. 4779 ద్వారా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు కల్పించిన పని దినాలను బట్టి వారికి వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30దినాలు పని కల్పించిన వారికి రూ.10వేలు, 20 నుంచి 29రోజులు పని కల్పించిన వారికి రూ.9వేలు, 10నుంచి 19రోజులు పని కల్పించిన వారికి రూ.7,500 నెలకు చెల్లిస్తున్నారు. ఇది ఫీల్డ్ అసిస్టెంట్లకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దిగారు.

అందరిని తొలగించిన ప్రభుత్వం

ఫీల్డ్ అసిస్టెంట్లకు విధించిన పని దినాల సర్కులర్‌ను రద్దు చేయాలని, షరతులు లేకుండా కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టం ప్రకారం రూ.21 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. ప్రభుత్వం హెచ్చరించినా వెనక్కి తగ్గక పోవడంతో ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించింది. అప్పటి నుంచి అందుబాటులో ఉన్న వారితోనే ఉపాధి పనులను నెట్టుకొస్తున్నారు. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వెనక్కుతగ్గిన ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సిఎం కెసిఆర్ ప్రకటించడంతో మళ్లీ ఆశలు రేకెత్తాయి.

రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ ఉపాధి కల్పించిన ప్రభుత్వం

అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆరు నెలల తర్వాత అధికారిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. దీంతో పంచాయతీ కార్యదర్శులపై మరింత పని భారం పెరగడంతో ఉపాధి పనుల పర్యవేక్షణ కరువవుతోంది. గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు కూడా కొనసాగడం వాటికి సంబంధించిన ప్రగతి నివేదికలు ఇతర పనులతో కార్యదర్శులు ఉపాధి పనుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు లేక పోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద చేపట్టే సిసి రోడ్లు, కల్లాలు, నర్సరీల నిర్వాహణపై దృష్టి సారించ లేక పోతున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కరువవడంతో అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం చివరికి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.

ఫీల్డ్ అసిస్టెంట్లలో హర్షాతిరేకాలు

విధుల నుంచి తొలగించిన వారందనిరి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఎం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారు. తాము చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి తగు నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లికి ప్రత్యేకంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి చిత్రపటాలకు ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభీషేకాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తాము వెంటనే విధుల్లో చేరుతామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News