Monday, April 29, 2024

మహబూబాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్ట్ అవుతున్నాయి. నిన్న మేడ్చల్ లో 12 మంది బెట్టింగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి 50 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు అయింది.

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారయ్యారు. నిందితుల నుంచి రూ. 8లక్షల నగదు, 5 స్మార్ట్ ఫోన్లు, వాహనాలు,ల్యాప్​టాప్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. బెట్టింగ్ లకు పాల్పడితే కఠిణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News