Thursday, May 9, 2024

నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదాలు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five Members dead in Nagar kurnool Road accidents

 

వనపట్ల: నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందారు. నాగర్ కర్నూల్ మండలం వనపట్ల వద్ద టిప్పర్ బైక్ ఢీకొని పొలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన సారంగి మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వంగూర్ మండలం రంగాపూర్ వద్ద బైక్ అదుపుతప్పి కెఎల్ఐ కాలువలో పడడంతో నరేష్(20) నాగరాజు(24) దుర్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్చేంజ్ ఎదురుగా గల అయ్యప్ప ఫర్నీచర్ పైఅంతస్తు నుండి పడి హైద్రాబాద్ కు చెందిన జక్క అర్జున్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే విధంగా పెంట్ల వెల్లి మండలం జెటప్రోల్ గ్రామంలో బస్సు ప్రమాదంలో కోల్లాపురం పట్టణానికి చెందిన గువ్వల ఆంజనేయులు అనే యువకుడు మృతి చెందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News