Monday, April 29, 2024

వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు…

- Advertisement -
- Advertisement -
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు జులై 31

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. బిఎస్‌సి మొదటి సంవత్సరంలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఎంసెట్- 2023 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినులు ఆన్లైన్ https://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. వనపర్తి , కరీంనగర్ లో ఉన్న మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న యువతులు ఈనెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఎంసెట్ -2023 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యార్థులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. సీటు సాధించిన విద్యార్థినీలు కాలేజి హాస్టల్ లోనే ఉండాలని, డే-స్కాలర్స్ విధానం ఉండదని మల్లయ్య బట్టు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,50,000/, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం రూ.2,00,000/- మించని విద్యార్థినీలు మాత్రమే అర్హులని తెలిపారు . దరఖాస్తు చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటే కార్యాలయ పనివేళల్లో 040-23328266 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News