Monday, April 29, 2024

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి తమ విదేశీ పర్యటన

- Advertisement -
- Advertisement -
ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ స్టడీ టూర్ లక్ష్యం
దక్షిణ కొరియా పర్యటనలో పర్యాటక మంత్రి శ్రీనివాస్ వెల్లడి
ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన దక్షిణ కొరియాలోని ఇండియన్ అంబాసిడర్

హైదరాబాద్ : పర్యాటకంగా దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్ కుమార్‌లతో కలిసి ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు దక్షిణ కొరియాలోని సియోల్ నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు సాంకేతక పరిజ్ఞానాన్ని జోడించి విదేశీ పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షించడమే తమ సియోల్ పర్యటన లక్ష్యం అన్నారు.

ఈ మేరకు ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియా రాజధాని సీయోల్ వాటర్ రివర్ ఫ్రంట్ ను అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణ, గోదావరి నదుల వెంట అద్భుతమైన సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉన్నాయన్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్న కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, మల్లన్న సాగర్,రంగనాయక సాగర్, మహబుబ్ నగర్ లోని ట్యాంక్ బండ్ అభివృద్ధి, అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్ జెయింట్ వీల్ , వేవ్ పూల్, వాటర్ రైడ్స్,వాటర్ స్పోర్ట్ అలాగే మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ వద్ద మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న రోప్ వే, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పర్యాటకులకు కనువిందు చేసేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త కొత్త పర్యాటక ఆకర్షణలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..
సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిజర్వాయర్ల వద్ద పర్యాటకంగా అనేక ఆకర్షణలను తీర్చిదిద్ది పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన సాగుతుందని తెలిపారు. కాగా తెలంగాణ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం శుక్రవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోగా వారికి దక్షిణ కొరియాలోని భారత రాయబారి ఈ మేరకు ఏయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News