Saturday, April 27, 2024

వెయ్యి రూపాయల కోసం నిండు ప్రాణం తీశారు

- Advertisement -
- Advertisement -

Friends Killed Friend For Thousand Rupees at Delhi

న్యూఢిల్లీ: అప్పుగా తీసుకున్న వెయ్యి రూపాయాలు అడిగినందుకు ఇద్దరు స్నేహితులు కలిసి మరో మిత్రుడిని దారుణంగా హతమార్చిన సంఘటన దేశరాజదాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సుహైల్, ఫర్హాన్ అనే స్నేహితులు ఉన్నారు. అయితే వారు అమన్ అనే మరో స్నేహితుడి దగ్గర నుంచి రూ. 1000 అప్పు తీసుకున్నారు. ఎన్నిసార్లు అడిగిన ఇవ్వకపోవడంతో విషయాన్ని అమన్ పెద్దల వరకు తీసుకెళ్లాడు. దీంతో అతనిపై ఆగ్రహించి కక్ష పెంచుకున్న ఆ ఇద్దరు అతన్ని ప్లాన్ ప్రకారం బయటకు తీసుకెళ్లి కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. స్థానికుల సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Friends Killed Friend For Thousand Rupees at Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News