Sunday, April 28, 2024

ఏటీఎంలలో రూ. 7లక్షలు దొంగిలించిన ముఠా

- Advertisement -
- Advertisement -

వైరా: ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల డీసీసీ బ్యాంకు ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సుమారు రూ.7 లక్షలు దోచుకెళ్లింది. ఖమ్మం జిల్లా వైరా, తల్లాడ మండలాల్లో జూలై 1న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చోరీ జరిగింది. వైరా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బ్యాంకు ఏటీఎంలలో ఎనిమిది మంది సభ్యుల ముఠా 6.96 లక్షల నగదును దోచుకున్నారు. ఈ ఏటీఎం మెషీన్లలో సాంకేతిక లోపాన్ని ఉపయోగించుకుని దుండగులు డబ్బును దోచుకున్నారని తెలిపారు.

వైరా బ్రాంచ్ మేనేజర్ ఏటీఎంలలో నగదు జమ చేస్తుండగా డబ్బులో తేడా రావడంతో అనుమానం వచ్చి ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అనంతరం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితులు నగదు పంపిణీ వ్యవస్థలను మోసగించారు. ఏటీఎం మెషీన్లలో సాంకేతిక లోపం ఉన్నట్లు వారు గుర్తించారు. నగదు తీసుకునేందుకు ఏటీఎం కార్డు పెట్టారు.

మెషిన్‌లో డబ్బులు లెక్కించే సమయంలో వారు మిషన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేశారు. దాన్ని తిరిగి ఆన్ చేసినప్పుడు, అది బ్యాలెన్స్ నుండి తీసివేయకుండా నగదును పంపిణీ చేసింది. నిందితులు కనీసం 17 ఏటీఎం కార్డులను ఉపయోగించి 30 లావాదేవీలు చేశారని బ్యాంక్ అధికారి తెలిపారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తల్లాడ, వైరాలో కేసులు నమోదు చేశారు. కేసులకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News