Monday, April 29, 2024

ఉత్తర్ ప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌: లక్నో సివిల్ కోర్టు ఆవరణలో భయంకరమైన గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి అలియాస్ ‘జీవా’ కాల్చి చంపబడ్డాడు. వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన జీవా 2006లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, యూపీ మాజీ మంత్రి బ్రహ్మదత్ ద్వివేది హత్యల కేసులో అరెస్టయ్యాడు. ద్వివేది హత్య కేసులో జీవా, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయ్‌సింగ్‌లకు జీవిత ఖైదు పడింది. జీవాకు మరో నాలుగు హత్యలతో సంబంధం ఉంది.

జీవాతో పాటు, కృష్ణానంద్ రాయ్ హత్యలో అన్సారీ సోదరులు (సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీ, ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ), వారి బంధువు ఎజాజ్ అన్సారీ, రాయ్ బరేలీకి చెందిన ఫిర్దౌస్, మున్నా బజరంగీ పేర్లు ఉన్నాయి. ఈ కేసులో సంజీవ్ మహేశ్వరిని కోర్టుకు హాజరుపరిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

లాయర్ వేషంలో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ దాడిలో మరో వ్యక్తి గాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ట్రామా సెంటర్‌కు తరలించినట్లు లక్నో పోలీసులు తెలిపారు. ‘జీవా’పై 22కి పైగా కేసులు నమోదయ్యాయి. అతను ముఖ్తార్ అన్సారీకి సన్నిహితుడని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News