Saturday, April 27, 2024

హెచ్‌ఆర్సీలో యువతిపై ప్రియుడు దాడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్‌కు వచ్చిన బాధితురాలిపై ప్రియుడు దాడిచేసిన సంఘటన గురువారం నాంపల్లిలోని హెచ్‌ఆర్‌సిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన యువతి కమిరెడ్డి కవిత తన ప్రియుడు అశోక్‌కుమార్ నాయక్ మోసం చేశాడని మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన అశోక్‌కుమార్‌ను కవిత నిలదీసింది. దీంతో ఆగ్రహం చెందిన అశోక్ ఆమెపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు నిందితుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Girl attacked by Lover at HRC in Nampally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News