- Advertisement -
లక్నో: కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆమె ఉరేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శాంతి నగర్ లో ఓ యువతి ఇద్దరు చెల్లెలు, మారు తల్లి, తండ్రితో కలిసి నివసిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి తండ్రి, తండ్రి తరుపు బంధువులు తనని వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొంది. మానసికంగా తన మారుతల్లి తనని వేధిస్తున్నదని తెలిపింది. ఇంట్లో వాళ్లు అందరూ వేధించడంతో బతకడం వ్యర్థం అనుకొని తనువు చాలిస్తున్నానని ఆమె పేర్కొంది. సూసైడ్ నోట్తో పాటు నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నానని పోలీస్ అధికారి కమలేష్ కుమార్ సింగ్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Girl Commit suicide with torture of Family members
- Advertisement -