Monday, April 29, 2024

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత రెండు నెలల్లో ఎప్పుడు లేనంతగా గురువారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.60,650కి చేరుకుంది. మరోవైపు, కేజీ వెండి ధర రూ.400 పెరిగి రూ.78,4000గా ఉంది.

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,800 గా ఉంది. అర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,600, 24 క్యారెట్లు బంగారం రూ.60,100గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,980 ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News