హైదరాబాద్: ఆర్టిసీ బస్సులో మహిళ దృష్టి మరల్చి పదితులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన సంఘటన అంబర్పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….. దుండిగల్కు చెందిన బాలమణి కుటుంబ సభ్యులతో కలిసి దిల్సుక్నగర్లోని బంధవుల వివాహానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేందుకు దిల్సుక్నగర్లో 107బస్సు ఎక్కింది. అంబర్పేట అలీ కేఫ్ వద్దకు రాగానే ఆమె పక్కన ఉన్న మహిళ తన డబ్బులు పడిపోయాయని చెప్పడంతో సాయం చేసేందుకు కిందికి వంగింది. ఇదే సమయంలో పక్కన కూర్చున్న మహిళ బాలమణి పర్సులో ఉన్న ఏడు తులాల లాంగ్ చైన్, కమ్మలు, మాటీలను చోరీ చేసేంది. బాధితురాలి ఆడబిడ్డ బ్యాగ్ జిప్ తీసి ఉందని చెప్పడంతో అందులో చూసేసరికి పదితులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే తన పక్కన కూర్చున్న మహిళ బస్సుదిగి వెళ్లిపోయింది. వెంటనే అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్పేట పోలీసులు తెలిపారు.
Gold Stolen on Bus in Hyderabad