Friday, May 17, 2024

ఆర్టీసి బిల్లుకు గవర్నర్ ఆమోదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్టీసి విలీన బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆర్టీసి ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. తాను చేసిన 10 ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విలీన బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ అనుమతికి పంపించిన విషయం తెలిసిందే.

అయితే, బిల్లును పరిశీలించిన గవర్నర్ పలు సూచనలు చేస్తూ అసెంబ్లీలో విలీన బిల్లును పెట్టేందుకు ఆమెదం తెలిపింది. దీంతో అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్ వద్దకు పంపించారు. అయితే, గవర్నర్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో తమిళిసై ఆర్టీసి బిల్లును ఆమోదించారు. దీంతో ఆర్టీసి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ గవర్నర్ ధన్యవాదాలు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News