Monday, April 29, 2024

నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మే రకు మంగళవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రులు టి.హరీశ్ రావు, గంగుల కమలాకర్, ఎస్. నిరంజన్ రెడ్డిలు ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ కొనుగోళ్లకు సిద్ధ్దం కావాలని, రాష్ట్రం లో రైతుల పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. ఇందుకు 7,100 కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోలు, సిఎంఆర్ సేకరణపై ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లలు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, డిఎంలు, ఎఫ్‌సిఐ అధికారులతో సోమవారం నాడు బిఆర్‌కెఆర్ భవన్ లో ఆర్ధిక శాఖమంత్రి టి. హరీశ్‌రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డిలు ఉన్నత స్థాయి సమావేశంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లను ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్దం చేసుకోవాలని, వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

యాసంగి సీజన్ సి ఎంఆర్‌ను ఈ నెల 30లోగా మిల్లర్లు నుంచి సేకరించాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అ ధికారులను ఆదేశించారు. ఇక నుంచి సిఎంఆర్ కింద బియ్యం అప్పగించే విషయంలో ఏమా త్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సిఎంఆర్‌ని అప్పగించి, ఈ సీజన్‌కు సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటి వరకు సిఎంఆర్ లో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగాస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. దేశంలో ఆయా రాష్ట్రాలలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో రెండు సీజన్ లో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణా రాష్ట్రం అని వారు పేర్కొన్నారు.

మంగళవారం నుంచి అదనపు కలెక్టర్లు జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రులు పేర్కొన్నారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లు గుర్తించి తగు ప్రతిపాధనలను ప్రభుత్వానికి సమర్పించాలని వారు సూచించారు. అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో రోజురోజుకు ధాన్యం దిగుబడి, కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. 2014-15 లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే ,ఇది 2020-21 నాటికి రూ.26 వేల 600 కోట్లకు చేరుకుందని వివరించారు. 9 సంవత్సరాలలో ఆరు రేట్ల ధాన్యం కొనుగోలు పెరగగా, మిల్లింగ్ సామర్థ్యం రెండు రేట్ల మాత్రమే పెరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని మిల్లర్ల నుంచి సిఎంఆర్ సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు. సేకరణ కేంద్రాలకు తెచ్చి ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పడు ఆన్ లైన్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , వ్యవసాయశాక కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ,రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News