Saturday, April 27, 2024

గ్రూపు-1 ఎగ్జామ్: పరీక్ష హాల్‌ నుంచి బయటికి వచ్చిన అభ్యర్థి అరెస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో పరీక్ష ప్రారంభం కాకముందే కేంద్రం నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్ అనే అభ్యర్దిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరీక్ష హాల్‌లో కూర్చున్న ప్రశాంత్ ఓఎంఆర్‌షీట్‌లో హాల్‌టికెట్ నంబర్ తప్పుగా రాశాడు. దీంతో పరీక్ష రాసిన వృథాగా బావించిన అభ్యర్ది పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో పోలీసులు ప్రశాంత్ ను అరెస్టు చేశారు. తరువాత మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 503 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఈపరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లా కేంద్రాల్లో 994 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 2,33,248 మంది అభ్యర్థులకు హాజరయ్యారు. 61.37 శాతం నమోదైనట్లు టిఎస్‌పిఎస్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News