Monday, April 29, 2024

బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో వేల కోట్లు సంపాదించావ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై  నిరాధారమైన ఆరోపణలు చేసి అబసు పాలు అవుతున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నాడు. డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని కెటిఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గాదరి కిషోర్, జీవన్ రెడ్డిలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో గువ్వల మాట్లాడుతూ.. ”మీ పార్టీ అధిష్టానానికి నీ మీద నమ్మకముంటే కెటిఆర్ విసిరిన సవాల్ ను రాహుల్ గాంధీనీ స్వీకరించమను. లేదంటే పిసిసి పదవికి రాజీనామా చేయ్యి. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ ఆర్టీఐ చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించావ్.రేవంత్ జైలుకు వెళ్లే టైం దగ్గర పడింది. సమాజంలో లాంగగానో, దొంగగానో గుర్తింపు కోసం టిఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం మానుకో” అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Guvvala Balaraju fies on Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News