Monday, April 29, 2024

చిచ్చు పెట్టే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: జిల్లా కేంద్రమైన సిద్దిపేట సూఫీ మసీదు ఆవరణలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో అలైబలై చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.

ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో 9 ఎండ్లలో అందరూ అన్నదమ్ముల వలె పండుగలు జరుపుకుంటున్నామన్నారు. అన్ని వర్గాల్లో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతున్నదన్న మంత్రి కులాల,మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News