Monday, May 6, 2024

ఆందోళన కలిగిస్తోంది

- Advertisement -
- Advertisement -

Harbhajan Singh

 

ముంబై : కరోనా మహమ్మరిని కట్టడి చేసేందుకే దేశంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారని, ఈ విషయాన్ని కొందరూ పట్టించుకోకుండా బాధ్యాతరహితంగా వ్యవహరించడం తనను ఎంతో ఆందోళన కలిగిస్తోందని టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. స్వస్థలాలకు వెళ్లేందుకు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేష న్ వద్ద వేలాది మంది వలస కార్మికులు గుమ్మికూడడం తనను ఆందోళనకు గురిచేసిందన్నాడు. కరోనా రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. కానీ, కొందరూ ముంబై నగరంలో దీన్ని అతిక్రమిస్తూ వేల సంఖ్యలో రోడ్లపైకి రావడం మంచిది కాదన్నాడు. కొన్ని రోజులు ఓపిక పడితే పరిస్థితులు మాములుగా మారడం ఖాయమన్నాడు. అప్పటి వరకు ప్రతిఒక్కరూ సహనంతో వ్యవహరించాలని హర్భజన్ సూచించాడు.

 

Harbhajan Singh express Concern on bandra
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News