Monday, April 29, 2024

కర్ణాటకలో రైతు బంధు, రైతు భీమా ఉందా?: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao comments on BJP

సంగారెడ్డి: కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు ఎత్తుకునేవారని, కానీ టిఆర్ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు ప్రజలకు కనిపిస్తున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.   సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కంగ్టి మండలంలో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పలు అభివృద్ధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులకు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.  రు. 1.65 కోట్లతో దెగుల్వాడి నుండి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. గత 5 ఏళ్లలో రు. 36 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశామని, 54 తండాలు గ్రామ పంచాయతీలు చేశామని, కొత్త బిల్డింగ్ కు 25 లక్షలు రూపాయల నిధులు మంజూరు చేయబోతున్నామన్నారు.  తండాల్లో త్రీ ఫేస్ కరెంట్ కనెక్షన్ ఇప్పించామని,  70 ఏళ్లలో కనీసం ఒక్క గిరిజన పాఠశాల లేదని, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక గిరిజన బిడ్డలు కోసం పాఠశాలలు ఏర్పాటు చేశామని, గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారన్నారు.

మంచినీళ్ల కోసం ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని, నీళ్ళు మోసి భుజాలు కాయలు కాసేవని, సిఎం కెసిఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నారని హరీష్ రావు ప్రశంసించారు. రైతులకు ఎలాంటి కష్టం ఉండకూడదని పంట పెట్టుబడి సాయం చేస్తున్నామన్నారు. కర్ణాటకలో రైతు బంధు ఉందా?, రైతు భీమా ఉందా?, కల్యాణ లక్ష్మి ఉందా? అని ప్రశ్నించారు. బిజెపి అంటేనే జూటా పార్టీ, జూటా మాటలని చురకలంటించారు. పక్కన కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ఉందని, 500 పించన్ ఇస్తున్నారని, ఇక్కడి లాగే ఎందుకు 2016 ఇవ్వడం లేదని నిలదీశారు. కాన్పు కావాలంటే గతంలో బీదర్ పోయేవాళ్ళమని, ఇప్పుడు కర్ణాటక నుండి ఇక్కడికి వస్తున్నారని కొనియాడారు. నారాయణ్ ఖేడ్ లో త్వరలో టి డయాగ్నొస్టిక్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News