Monday, April 29, 2024

శ్రీజ మోములో నూరేళ్లు చిరునవ్వు వెళ్లి విరియాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: జిల్లా కేంద్రంలో రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించిన శిశుగృహాన్ని శనివారం రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం శిశు గృహలో అనాధ శిశువులను మంత్రి తన్నీరు హరీష్ రావు పరిశీలిస్తున్న క్రమంలో 3 నెలల వయస్సున్న చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా శిశుగృహ ఆయాల చేతిలో ఆడుకుంటూ కనబడటంతో ఆ పాపను ఎత్తుకొని ముద్దులోలుకుతున్న ఆ చిన్నారికి శ్రీజ అని పేరు పెట్టి శ్రీజ ముఖంలో ఎప్పటికి చిరునవ్వులు తొలగని విదంగా తల్లిదండ్రులు లేని లోటు కనబడకుండా ఆనందంగా పెరిగి నిండునూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించేలా శిశు గృహ అధికారులు ఉన్నంతంగా తీర్చిదిద్దాలని ఆశీర్వదించారు. తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు నోచుకోని ఇలాంటి అనాధ పిల్లల సేవచేయడం ప్రజా ప్రతినిధులుగా మాకు చాలా సంతృప్తిని ఇస్తుందని అనాధ శిశువులందరినీ శిశు గృహ అధికారులు సొంత బిడ్డల లాగా చూసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

కాగా, సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి శివారులో నిరుపేద తల్లి 3 నెలల ఈ చిన్నారిని (శ్రీజ)ను విక్రయిస్తుండగా జిల్లా బాలల సంరక్షణ అధికారులు తల్లి నుండి చిన్నారిని తీసుకొని లీగల్ గా శిశు గృహలో చేర్పించి అలనా పాలన చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News