Monday, April 29, 2024

ఇదేనా ప్రజాపాలన?:హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ ’ప్రజాపాలన’లో సా టి ప్రజా ప్రతినిధులను మంత్రులు అవమానపరుస్తున్నారని బి ఆర్‌ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మొన్న రైతుబంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపు ని చ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం యాదాద్రి భువనగిరి జెడ్‌పి చైర్మన్ సందీప్‌రెడ్డిపై అధికారిక కార్యక్రమం లో అకారణంగా దుర్భాషలాడి కాంగ్రెస్ నియంతృత్వ పోకడల కు నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. కోమటిరెడ్డి తాను మా ట్లాడింది చాలదన్న ట్లుగా పోలీసులకు హుకుం జారీ చేసి సం దీప్‌రెడ్డిని బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించా రు. కోమటిరెడ్డి తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా కోమటిరెడ్డి పోకడలను తీవ్రంగా ప్ర తిఘటించాలని పిలుపు నిచ్చారు. కోమటిరెడ్డికి ప్రజా స్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకమున్నా జిల్లా పరిషత్ ఛైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గూడూరు గ్రామంలో గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇదే సభలో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. సందీప్ రెడ్డి మాట్లాడుతూ నాడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడమే కాకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పై బుర ద జల్లడం సరికాదన్నారు. రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలనడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ సమయంలో మం త్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని మహా నాయకుడు మాధవరెడ్డి కడుపులో పుట్టిన సందీప్‌రెడ్డి ఓ బచ్చా కనీసం వార్డు మెంబర్ గా గెలవలేని వ్యక్తి అంటూ విమర్శలు చేశారని బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులు స్టేజ్ పైకి వచ్చారు. సందీప్ రెడ్డిని తోసివేసే ప్రయత్నం చేయగా బిఆర్‌ఎస్ శ్రేణులు ఆయనను పక్కకు తీసుకువెళ్లినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News