కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచేది గెల్లు శ్రీనివాసే అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కుక్కర్లు, కుట్టు మిషన్లు, గడియారాలు పంచినా టిఆర్ఎస్సే గెలుస్తుందన్నారు. హుజూరాబాద్లో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈటల మాటలకు చేతలకు సంబంధమే లేదు. లెఫ్టిస్టునని చెప్పుకునే ఈటల రాజేందర్ బిజెపిలో చేరి ఆత్మ వంచన చేసుకున్నాడని, ఈటలకు ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. కాషాయ జెండా పట్టుకుని ఎర్ర జెండా మాటలు మాట్లాడే ఈటల రాజేందర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునే రకమని ఎద్దెవా చేశారు. హుజూరాబాద్ గడ్డా.. టిఆర్ఎస్ అడ్డా అని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించి ఈటలకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి హరీశ్రావు పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సతీష్కుమార్, పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Harish Rao speech at Party meeting in Huzurabad