Monday, April 29, 2024

హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో అంతటా పచ్చదనం పరిఢవిల్లింది !

- Advertisement -
- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వెల్లడి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉప్పల్ భగవత్ హెచ్‌ఎండిఎ లే ఔట్ లో తెలంగాణ హరితోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఉప్పల్ ఎంఎల్‌ఎ భేతిసుభాష్ రెడ్డి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించామన్నారు. తెలంగాణ ఏర్పడిన 9 సంవత్స రాలలో హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పచ్చదనం గురించి చైతన్యం తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఎంతో పచ్చదనం పెరగడం జరిగిందన్నారు. తెలంగాణ హరితోత్సవంలో బాగంగా ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండిఎ లే ఔట్ లో మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి ఎంపి సంతోష్ కుమార్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఎంఎల్‌ఎ బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలం గాణ హరితోత్సవంలో బాగంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపి సంతోష్‌తో కలిసి ఉప్పల్‌లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిందన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటుతున్నారని తెలి పారు. హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా గ్రీనరి పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి, రాఘవ, వివిధ డివిజన్ల కార్పొరేట ర్లు, స్థానిక బిఆర్‌ఎస్ నాయ కులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News