Saturday, April 27, 2024

విశ్వహిందూ మహాసభ చీఫ్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Ranjit-Bachchan

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి హిందూ ప్రతినిధుల పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్ ను దుండగులు కాల్పిచంపారు. ఈ ఘటన లక్నోలో  తీవ్ర కలకలం రేపుతోంది. లక్నోలోని హజరత్ గంజ్ లో ఆదివారం తెల్లవారుజామున బచ్చన్ అతని సోదరుడితో కలిసి వాకింగ్ కి వెళ్లిన సమయంలో వారిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బచ్చన్ తలలో బుల్లేట్ దిగడంతో అక్కడిక్కడే మృతి చెందారు.

కాగా, అతని సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తక్షణమే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  ఇటీవలి కాలంలో యుపిలో హిందుత్వ ప్రతినిధులను కాల్చిచంపిన ఘటనల్లో ఇది రెండవది కావడం విశేషం.

Hindu Mahasabha leader Ranjit Bachchan shot dead

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News