Friday, May 3, 2024

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

Huge devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. నిన్న సెలవు రోజు కావడంతో  పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. మొత్తం 30,811 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం శ్రీవారికి 14,688 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీకి రూ.2.76 కోట్ల రూపాయలు కానుకల రూపంలో వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనం టోకన్ల సంఖ్యను 8వేలకు పెంచినట్లు టిటిడి తెలిపింది. దీంతో శ్రీవారి ఆలయంలో దర్శన సమయాన్ని కూడా పెంచారు. శ్రీవారి ఏకాంత సేవను రాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కలిపించనట్టు టిటిడి అదికారులు తెలిపారు.

Huge devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News