Monday, April 29, 2024

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి ఎగువ నుండి భారీగా వరద కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 69 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా.. శుక్రవారం మధ్యాహ్నానికి ప్రాజెక్టు నీటిమట్టం 1075.70 అడుగులు 41.452 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు నుండి ఆవిరి రూపంలో 430 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 50 క్యూసెక్కులు, త్రాగునీటి అవసరాలకు మిషన్ భగీరథకు 152 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్ రిజర్వాయర్ నీటిమట్టం 1088.50 అడుగులు, 78.023 టీఎంసీలుగా ఉంది. 1 జూన్ నుండి ఇప్పటివరకు 22.388 టీఎంసీల నీరు వచ్చి చేరింది.1 జూన్ నుండి ఇప్పటివరకు 3.249 టీఎంసీల నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News