Monday, April 29, 2024

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తన భక్తులు..

- Advertisement -
- Advertisement -

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండగ సందర్భంగా రాజన్న దర్శించుకునేందుకు సోమవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ఈసందర్భంగా భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్సాటు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News