Saturday, April 27, 2024

భార్యతో గొడవ…. భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Husband commit suicide over fighting of wife

హైదరాబాద్: దంపతుల మధ్య గొడవ జరగడంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కి కరెంట్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అక్బర్‌ఖాన్(40) అనే వ్యక్తి ఓ ఆపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ అక్బర్‌బాగ్ డివిజన్‌లోని దిల్‌కుషా ఫంక్షన్ హాల్ సమీపంలో ఉంటున్నాడు. అక్బర్‌ఖాన్ వేధింపులు తట్టుకోలేక మొదటి భార్య అతడి నుంచి దూరంగా ఉంటుంది. దీంతో అజ్మీరీని అక్బర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురు పిల్లలు ఉన్నప్పటికి రెండో భార్యకు సంతానం కలగలేదు. మొదటి భార్య తమ్ముడితో కలిసి మద్యం తాగాడు. అనంతరం ఇంటికెళ్లి రెండో భార్యతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో సహనం కోల్పోయిన అక్బర్ ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కి తీగలను పట్టుకున్నాడు. కరెంట్ తీగలను పట్టుకోగానే భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. దీంతో ఎగిరి కింది పడి ఘటనా స్థలంలోనే చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News