అమరావతి: భార్యపై అనుమానాన్ని పెంచుకున్న ఓ భర్త కత్తితో ఆమె కాళ్లు, చేతులు నరికేసి పోలీసు స్టేషన్కి వెళ్లి లొంగిపోయిన దారుణ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాళహస్తికి చెందిన వెంకటేశ్ కు ఆరు నెలల క్రితం నెల్లూరుకు చెందిన దుర్గతో వివాహం జరిగింది. మొదట్లో కొన్ని నెలలు బాగానే ఉన్న వెంకటేశ్, గత కొన్ని రోజులుగా భార్యను అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఇతర వ్యక్తితో క్లోజ్ గా ఉంటోందని ఆరోపిస్తూ దుర్గతో తరుచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో ఆమె నిద్రపోతున్న సమయంలో కాళ్లు, చేతులు నరికేశాడు. గమనించిన స్థానికులు ఆమెను నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
husband cuts wife hands and legs at chittoor district