- Advertisement -
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లాలోని పెన్ పహాడ్ మండలం జల్మలకుంట తండాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను నరికి హత్య చేశాడు. కుటుంబ కలహాలతో నేపథ్యంలోనే భార్యను గొడ్డలితో నరికి చంపినట్టు స్థానికులు చెబుతున్నారు. నిందితుడిని స్వామిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నాలుగు నెలల క్రితం నిందితుడు తన కన్నతండ్రిని దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
husband murder wife at suryapet district
- Advertisement -