Monday, April 29, 2024

టీమిండియాకు ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

IND vs ENG first Test:95-run lead for India

 

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పైచేయి సాధించింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు కీలకమైన 95 పరుగుల ఆధిక్యం లభించింది. 125/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు కెఎల్.రాహుల్ అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్‌ఆడిన రాహుల్ 12 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా (56), బుమ్రా (28) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట ముందుకు సాగలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News