సిడ్నీ టెస్టు: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244కి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్ నైట్ స్కోర్ 96/2తో మూడురోజు భారత్ ఆట ప్రారంభించింది. పుజారాతో కలిసి 21 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక రహానే(22) ఔటయ్యాడు. పూజారా 176 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. పుజారా కెరీర్ లో 26వ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు పుజారా. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ హనుమ విహారి(4) విఫలమైయ్యాడు. ఐదో వికెట్ కు పుజారా, పంత్ 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వరస ఓవర్లలో పుజా, పంత్ వికెట్ పొగొట్టుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే రవిచంద్రన్ అశ్విన్(10), నవదీప్ సైనీ(3), బుమ్రా(0) వికెట్లు కోల్పోయారు. విహారి, అశ్విన్, బుమ్రా రనౌట్ గా వెనుదిరిగారు.
India 244 all out in first innings in Sydney Test