Monday, April 29, 2024

టీమిండియా ప్రపంచకప్‌ గెలుస్తుంది: బ్రెట్‌లీ

- Advertisement -
- Advertisement -

India Still favourites to win T20 World Cup: Brett Lee

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు సెమీస్ చేరే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్‌లీ పేర్కొన్నాడు. పాకిస్థాన్ చేతిలో ఓడిపోతే భారత్ ట్రోఫీ రేసు నుంచి వైదొలిగినట్టు కాదన్నాడు. మళ్లీ పుంజుకుని విజయాల బాట పట్టే సత్తా భారత్‌కు ఉందన్నాడు. అంతేకాదు, టీమిండియా ప్రపంచకప్‌ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. అయితే దీని కోసం విరాట్ సేన తన ఆటను పూర్తిగా మార్చుకోవాలన్నాడు. హార్దిక్ పాండ్యతో బౌలింగ్ చేయించాలన్నాడు. అంతేగాక షమి, భువనేశ్వర్‌లు మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందన్నాడు. న్యూజిలాండ్ మ్యాచ్లో వీరిద్దరూ పుంజుకుంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలు అంచనాలకు మించి రాణిస్తున్నాయన్నాడు. దీంతో ఈ జట్లకు కూడా ట్రోఫీ సాధించే అవకాశాలున్నాయన్నాడు.

India Still favourites to win T20 World Cup: Brett Lee

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News