Monday, April 29, 2024

గాన గాంధర్వుడికి క్రికెటర్ల ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

ముంబై: తన పాటలతో కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న గాన గాంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై భారత క్రికెట్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం పాటలను వారు గుర్తు చేసుకున్నారు. భారత్‌కు లభించిన అతి కొద్ది మంది అత్యుత్తమ గాయకుల్లో బాలు ఒకరని వారు పేర్కొన్నారు. ఆయన మృతితో భారత్ ఓ దిగ్గజ గాయకుడిని కోల్పోయిందని క్రికెటర్లు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాలు గొంతుక రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్.లక్ష్మణ్, సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్ తదితరులు బాలు మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Indian Cricketers Condolences to SP Balu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News