Monday, April 29, 2024

జూనియర్ ఎన్‌టిఆర్‌తో భారత క్రికెటర్ల భేటి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్‌లో న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డేలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన భారత క్రికెటర్లు నగరంలో సందడి చేశారు. మంగళవారం టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, చాహల్ తదితరులు టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్‌టిఆర్‌ను కలిశారు.

గతంలో ఖరీదైన కార్ కలెక్షన్స్‌తో ఆకట్టుకున్న హైదరాబాద్ వాసి నజీర్ ఖాన్ ఇంటిలో క్రికెటర్లు ఎన్‌టిఆర్‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్‌టిఆర్‌తో ఫొటోలు దిగారు. ట్రిపుల్‌ఆర్ సినిమాతో జూనియర్ ఎన్‌టిఆర్ పాన్ ఇండియా స్టార్ ఎదిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News