Monday, April 29, 2024

పది మందికి సాయం చేసేవారు బ్రతికే ఉంటారు

- Advertisement -
- Advertisement -

Indo-Israel Friendship Association 28th Week Celebration

సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారు
ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్ : పది మందికి సాయం చేసేవారు మరణించాక సాయం పొందిన వారి మనసులో బ్రతికే ఉంటారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్‌షిఫ్ అసోసియేషన్ 28వ వారోత్సవాలు హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఇండియా, ఇజ్రాయెల్ దేశాల స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేందుకు ఈ అసోసి యేషన్ చాలా కృషి చేస్తుందని మంత్రి కొనియాడారు. ఇరు దేశాల సంస్కృతీ, సంప్రదాయాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయ మన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. కులం, మతం అనేది మనిషి పుట్టిన తరువాతే ఏర్పడి, చచ్చిన తరువాత వెళ్లిపోతాయని, కానీ సమాజం కోసం చేసే సేవ పది కాలాలు పదిలంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌లను మంత్రి ప్రదానం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News